ధవళేశ్వరం : ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీపై జనసేనాని ఆధ్వర్యంలో జన సైనికులతో జనసేన కవాతు ప్రారంభమయ్యింది. ఈ కవాతులో పాల్గొనేందుకు భారీ స ంఖ్యలో జన సైనికులు 13 జిల్లాల నుంచి తరలి వచ్చారు. బ్యాండ్ భాజాలతో ప్రారంభమైన కవాతులో ఎటు చూసినా జనసంద్రంగానే కనిపిస్తోంది. కాబోయే సీఎం అంటూ పవన్ కు జన సైనికులు ఘన స్వాగతం పలికారు. అంచనాలను మించి జనసైనికులు కవాతుకు వచ్చారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర కవాతు సాగనుంది.