తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 14 వైకుంఠం క్యూ కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ బుక్ చేసుకున్న భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. కాలినడకన కొండ ఎక్కి వచ్చిన భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది.