అర్ధరాత్రి కొండచరియలు విరిగిపడి 12 మంది మృతిచెందారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘోర విషాద సంఘటన ఒడిశాలోని గజపతి జిల్లా గొంగాబాడోలో చోటుచేసుకుంది. తిత్లీ ప్రభావంతో సంభవించిన భారీ వర్షానికి, వరదలకు తలదాచుకునేందుకు 16 మంది వ్యక్తులు సొరంగంలోకి వెళ్లారు. సమాచారం తెలిసిన జిల్లా కలెక్టర్ ఘటనాస్థలానికి సహాయక బృందాలను పంపారు. జిల్లా ఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.