విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మతల్లిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు అవస్థలు పడుతున్నారు. శరన్నవరాత్రుల్లో తొలిరోజు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే వీఐపీల కే అధికారులు, పోలీసులు సమయం కేటాయిస్తున్నారు. గంటల తరబడి వీఐపీలకే సమయం కేటాయిస్తుండటంతో క్యూలైన్లలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వీఐపీలు అమ్మవారిని దర్శించుకునేందుకు నిర్ణీత సమయం ఏర్పాటు చేయకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారుల తీరుపై మండిపడుతూ రాజగోపురం వద్ద భక్తులు నిరసనకు దిగారు.