న్యూఢిల్లీ : 403 శాసనసభ స్థానాలున్న యూపీలో బీజేపీకి 190-210, సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమికి 110-130, బీఎస్పీకి 57-74, ఇతరులకు 8 ఎమ్మెల్యే స్థానాలు దక్కే అవకాశం ఉందని టైమ్స్ నౌ -వీఎంఆర్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మోదీ ప్రభంజనం కొనసాగుతోందని పేర్కొంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వల్ల సమాజ్వాదీ పార్టీకి నష్టం జరిగినట్లు కనిపిస్తోందని పేర్కొంది. బీజేపీకి 34 శాతానికి పైగా ఓట్లు లభించాయని, ఏడు ప్రాంతాల్లో ఆ పార్టీకి అనుకూలంగా గొప్ప ప్రభంజనం కనిపించిందని తెలిపింది.