అనంతపురం జిల్లా హిందూపురం రూరల్ మండలం కొటిపి పంచాయతీ ఉమాశంకర్ రెడ్డి అరటి చెట్లను బుధవారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు 100 చెట్లను నరికేశారు. మరో నెలలో పంట చేతికి అందే సమయంలో అరటి చెట్లను నరికేశారు. దీనిపై గ్రామస్తులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై రూరల్ పోలీసులు పంటను పరిశీలించి కేసు నమోదు చేశారు.