అమరావతి: సిఎస్ దినేష్ కుమార్ ఈనెల 30న పదవీవిరమణ పొందనున్నారు. ఈ క్రమంలో సాధారణ పరిపాలన శాఖ దినేష్ కుమార్ కు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీఎస్ 35ఏళ్ళు ఐఏఎస్ గా పనిచేసిన నాకు సిఎస్ గా అవకాశం కల్పించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. నా ఏడాదిన్నర కాలంలో కేంద్ర ప్రాయోజిత నిధులను రెట్టింపు చేశానన్న అయన సహచార ఉద్యోగుల సహకారం మరువలేనిది అన్నారు. యువఅధికారుల నేతృత్వంలో రాష్ట్రం దేశంలో ఉత్తమ రాష్ట్రంగా నిలుస్తుందన్నారు.