డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాలయ చినరాజప్ప ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా చినరాజప్ప పలు కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఉదయం చినరాజప్ప అమలాపురం నుండి పెద్దాపురానికి బయలుదేరుతారు. ఉదయం 10.30 గంటలకు మంత్రి చినరాజప్ప పెద్దాపురం చేరుకుని అంగన్ వాడీ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 11.30 గంటలకు సామర్లకోటలోని ఆటో డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో జరిగే ” మహా అన్నదానం” కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.00 గంటలకు సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరవుతారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వరకు కట్టమూరు గ్రామంలో జరిగే “గ్రామ దర్శిని – గ్రామ వికాసం కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5.45 గంటలకు కాకినాడ గ్రామీణ నియోజకవర్గం వాకలపూడి లోని ఎన్టీఆర్ బీచ్ లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. రాత్రి 8.08 గంటలకు కాకినాడ నుండి విశాఖపట్నానికి వెళ్తారు. రాత్రి 11.00 గంటలకు విశాఖపట్నం చేరుకుని ప్రభుత్వ అతిథి గృహంలో బస చేస్తారు.