తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల తాకిడితో క్యూలైన్లు, ఆలయ ప్రాంగణంతో పాటు ప్రసాదం కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో నిండిపోయింది. రద్దీ అధికంగా ఉండటంతో భక్తులు వైకుంఠం వెలుపల బారులు తీరారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 20 గంటల సమయం కేటాయించారు. టైమ్స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం ఇచ్చారు.