దివ్యాంగులకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జనసేనాని ప్రజాపోరాట యాత్ర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఏలూరులో వికలాంగులతో ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… దివ్యాంగులకు జనసేన ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. వికలాంగులకే కాకుండా వారిపై ఆధారపడ్డ కుటుంబానికి పెన్షన్ ని మేనిఫెస్టోలో పెడతామన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా దివ్యాంగుల పరిస్థితి మారలేదన్నారు. ఎన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగినా దివ్యాంగులకు సంక్షేమ చర్యలు లేవన్నారు.