ఎన్నికల్లో వికలాంగులకు అవకాశం కల్పించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జనసేనాని ప్రజాపోరాట యాత్ర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఏలూరులో వికలాంగులతో ఆయన సమావేశమయ్యారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా దివ్యాంగుల పరిస్థితి మారలేదన్నారు. ఎన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగినా దివ్యాంగులకు సంక్షేమ చర్యలు లేవన్నారు.