అమరావతి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీల హక్కులను హరించాయని ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ… ఎస్సీ, ఎస్టీ నిధులు పక్కదారి పడుతున్నా చర్యలు లేవన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. భాజపా లేదా వంత పాడే ఏపార్టీ వచ్చినా రిజర్వేషన్లు ఎత్తివేస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరుగుతుందన్నారు. త్వరలో ‘ఇంటింటికీ కాంగ్రెస్ పార్టీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రైవేట్ రంగం, విద్యా సంస్థల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు.