ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం నుంచి అన్న క్యాంటీన్ వరకూ అంతా అవినీతే: ఉండవల్లి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 25, 2018, 03:49 PM

పోలవరం ప్రాజెక్టు నుంచి అన్న క్యాంటీన్ వరకూ అంతా అవినీతేనని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘పోలవరం’ అవినీతి గురించి కాగ్ నివేదికలో బయటపెట్టిన దానిపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ముఖ్యమైన పనులు ఇంకా పూర్తి కాలేదని, 2019లో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం జరిగే పని కాదని కాగ్ నివేదికలో పేర్కొన్న విషయాన్ని ఉండవల్లి ప్రస్తావించారు. అన్న క్యాంటీన్లకు సంబంధించి అంతా అవినీతేనని, ఆదరణ పథకం కూడా లొసుగుల మయమని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com