విశాఖ : మావోయిస్టుల కదలికలతో ఎపి డిజిపి విశాఖ పర్యటనపై పోలీసులు ఎటూ తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్నారు. మావోయిస్టులు ఒక సిటింగ్ ఎమ్మెల్యేను, మరొక మాజీ ఎమ్మెల్యేను హతమార్చిన నేపథ్యంలో డిజిపి ఠాకూర్ విశాఖ పర్యటనకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. అరకు ఘటన వివరాలతో పోలీసులు ఒక నివేదికను సిద్ధం చేశారు. పోలీస్ అధికారులతో డిజిపి ఉన్నత స్థాయి సమావేశాన్ని రేపు ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అనంతరం డిజిపి పర్యటనపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.