విజయవాడ: రాష్ట్రానికి రైల్వేజోన్పై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎంపీ కేశినేని అన్నారు. విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే జీఎంతో జరిగిన సమావేశాన్ని టీడీపీ ఎంపీలు బహిష్కరించి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని మాట్లాడుతూ వైసీపీ, బీజేపీ కుమ్మక్కు కావడం వల్లే ఇవాళ సమావేశానికి రాలేదన్నారు. ప్రజా ప్రయోజనాల కంటే వారికి రాజకీయాలే ఎక్కువ అని విమర్శించారు.