న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్లో టెక్కింగ్కు వచ్చిన రూర్కీ ఐఐటీ విద్యార్థులంతా క్షేమంగానే ఉన్నారని ఆ రాష్ట్ర సీఎం జైరాం థాకూర్ తెలిపారు. హిమాచల్లో ట్రెక్కింగ్ వెళ్లిన 50 మంది సభ్యుల బృందం సోమవారం సాయంత్రం నుంచి అగుపించకుండా పోయింది. వీరిలో 35 మంది ఐఐటీ విద్యార్థులు ఉన్నారు. హిమాచల్లో భారీ వర్షాలు, మంచు తుఫానులు కురుస్తున్న నేపథ్యంలో వీరి ఆచూకీ గల్లంతుకావడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం విద్యార్థుల ఆచూకీని కనుగొంది. లాహోల్-స్పితి ప్రాంతంలోని సిసులో విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని సీఎం పేర్కొన్నారు.