విశాఖ మన్యంలో నిన్న మావోయిస్టుల ఘాతుకానికి నిరసనగా గిరిజన సంఘాలు ఇవాళ, రేపు ఏజెన్సీ బంద్కు పిలుపునిచ్చాయి. మన్యం బంద్ దృష్ట్యా భారీగా పోలీసులు మోహరించారు. అరకు ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు భారీగా మోహరించారు. నిన్నటి ఘటనకు అప్రమత్తమైన పోలీసులు మన్యంలోని అన్ని ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. విశాఖ నుంచి అరకుకు 12 స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు చేరుకున్నాయి. ఏజెన్సీలో 8 గ్రేహౌండ్స్ దళాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.