నెల్లూరులోని బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ కొనసాగుతోంది. రొట్టెల పండుగలో భాగంగా బారా షహీద్ దర్గా వద్ద నిర్వహించిన గంధం మహోత్సవం ముగిసింది. బారా షహీద్ గంధోత్సవానికి భారీగా సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బారాషహీద్ సమాధులకు కడప పీఠాధిపతి ఆరీఫుల్లా హుస్సేన్ గంధం పూశారు. రొట్టెల పండుగ వేడుకలకు మంత్రి నారాయణ, మేయర్ అబ్దుల్ అజీజ్ హాజరయ్యారు.