ఏపీ మంత్రి నారా లోకేష్ చైనా పర్యటన కొనసాగుతుంది. తాజాగా వివో ప్రెసిడెంట్ షేన్ వెయ్ తో లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వనరులను వివరించిన లోకేష్ పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఇప్పటికే ఏపీలో ఉన్న మొబైల్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ల గురించి వివరించిన లోకేష్ వివో సప్లయర్స్ ను కూడా ఏపీకి తీసుకురావాలని వివో ప్రెసిడెంట్ ను కోరారు. దేశంలో కంపెనీని విస్తరించే ఆలోచనలో ఉంటే ఏపీకి రావాలని.. ఏపీలో ఉన్న వనరులను ఉపయోగించుకోవాలని కంపెనీ విస్తరణకు సహకరిస్తామన్నారు.