విజయవాడ : బీజేపీ రాష్ట్ర సమావేశంలో చేసిన తీర్మానాలన్నీ లోపభూయిష్టమేనని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రఫెల్ కుంభకోణంతో దేశ భద్రతనే అమ్ముకున్న బీజేపీ అవినీతి గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రాయలసీమ లో హైకోర్టు కావాలంటున్న బీజేపీ అమరావతిలో సుప్రీంకోర్టు ఎందుకు పెట్టరు ? వెనుకబడిన ప్రాంతాలకు నిధులు రాకుండా చేసింది బీజేపీ కాదా ?అని ప్రశ్నించారు. దేశంలో ప్రాంతీయ, మత తత్వాలను బీజేపీ రెచ్చగొడుతోందని, బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో అరాచకాలు పెరిగిపోయాయని విమర్శలు గుప్పించారు. మోదీ, బీజేపీ నేతలకు ఏపీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మాణిక్య వరప్రసాద్ అన్నారు.