కాకినాడ, మేజర్న్యూస్ : దేవాదాయ శాఖలో పనిచేస్తున్న కార్యనిర్వహణా ధికారులు తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమించేందుకు నిర్ణయించారు. దీనిలో భాగంగా ఈ నెల 23వ తేదీన విజయవాడలోని కమిషనర్ కార్యాలయం వద్ద మౌన ప్రదర్శన చేయాలని తీర్మానించారు. ఈ పరిణామాలపై చర్చించేం దుకు బుధవారం దేవాదాయ శాఖ రాష్ట్ర కార్యనిర్వహణాధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి నర్సింబాబు కాకినాడ డివిజన్ ఈవోలతో స్థానిక శ్రీ బాలా త్రిపుర సుందరి ఆలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నర్సిం బాబు మాట్లాడుతూ దశాబ్ద కాలం నుండి ఈవోలకు పదోన్నతులు లేవన్నారు. అలాగే వివిధ సమస్యలు పెండింగ్లో ఉన్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో తాము మౌనప్రదర్శనకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. అనంతరం కమిష నర్ అనురాధ సంఘ ప్రతినిధులతో చర్చించారన్నారు. పదోన్నతుల కోసం డిపిసి ఏర్పాటు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్నా, క్రమ శిక్షణా చర్యల ఫైళ్ల పరి ష్కారం, సర్వీస్ మేటర్లు తదితర అంశాలను ఆమె ముందు వుంచా మన్నారు. దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అర్చకుల సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స నిర్వహిస్తున్న విధంగానే ఇక నుండి ఈవోలకు గ్రీవెన్స ఏర్పాటు చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారన్నారు. తమ డిమాండ్ల కోసం చర్చించేం దుకు ఈ నెల 15న నెల్లూరులో కమిషనర్ అనురాధ ప్రధాన కార్యాల యాల్లోనే ఆయా సెక్షన్ల అధిపతులతో సమావేశం పెట్టారన్నారు. 15వ తేదీన కమిషనర్ తమ డిమాండ్లపై స్పందించే తీరును బట్టి 23న మౌన ప్రదర్శన ఉంటుందన్నా రు. దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఈవోల సమస్యలపై గ్రీవెన్స ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈవోలు తమ సమస్యలను ఈనెల 28లోగా నిర్ధేశించిన ఫార్మాట్లో లిఖితపూర్వకంగా కమిష నర్ కార్యాలయానికి తెలియజేయాలని ఆయన సూచించారు. వాటిని ఏప్రిల్ 20లోగా పరిష్కరించేందుకు కమిషనర్ చర్యలు తీసుకుంటామన్నారు. అప్ప టికీ పరిష్కారం కాకపోతే 20న విజయవాడలో కమిషనర్ నిర్వహించే గ్రీవెన్స లో వాటిపై తుదిచర్యలు ఉంటాయని నర్సింబాబు వెల్లడించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర జాయింట్ కార్యదర్శి ఇ. పళ్లం రాజు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఉండ
ల్లి వీర్రాజు చౌదరి, ఈవోల సంఘం ప్రతినిధులు దారబాబు, నాగ మల్లేశ్వర రావు, సిహెచ్వి.రమణమూర్తి, మురళీ వీరభద్రరావు, వినోద ్కుమార్ పాల్గొన్నారు.