ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 17, 2018, 05:02 PM

ఉరవకొండ మండలం లత్తవరం తాండలో అప్పుల బాధతో గిరిజన రైతు తిప్పే నాయక్ (50) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి రైతు మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. రైతు కుటుంబానికి తక్షణమే ఐదు వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ ఘటన పట్ల విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. రైతు ఆత్మహత్యపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పు బట్టారు. రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి పట్టవని విమర్శించారు. ఆత్మహత్యలు నివారించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని అనంతపురం జిల్లాలో ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలన్నారు. సాంకేతిక కారణాల అడ్డు చూపకుండా తక్షణమే రైతుల కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa