రాష్ట్రంలోనే ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్నకృష్ణా జిల్లా హంసలదీవి సాగర సంగమాన్ని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు లో కృష్ణా జిల్లా ఇన్ చార్జి పోర్ట్ఫోలియో న్యాయమూర్తి వి. రామ సుబ్రహ్మణ్యన్ సందర్శించి పుణ్య స్నానం ఆచరించారు. అనంతరం కృష్ణవేణి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరివెంట కృష్ణాజిల్లా ప్రధాన నాయమూర్తి లక్ష్మణరావు, అవనిగడ్డ డిఎస్పీ పోతురాజు తో పాటు న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు ఉన్నారు.