శ్రీనగర్ : జమ్ముాకాశ్మీర్లో కుల్లాం జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు శనివారం ఉదయం మరణించారని పోలీసులు వెల్లడించారు. దక్షిణ కాశ్మీర్లోని చౌగ్రామ్లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించారు. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపగా, భద్రతాదళాలు కూడా ఎదురుదాడికి దిగారన్నారు. ఈ ఎన్కౌంటర్లో మొదట ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందగా, మిగిలిన వారిద్దరి కోసం ఆపరేషన్ కొనసాగిందని అధికారులు పేర్కొన్నారు. అనంతరం ఇద్దరు ఉగ్రవాదులను కూడా కాల్పుల్లో మరణించినట్లు పోలీసులు తెలిపారు.. శాంతి భద్రతల నడుమ బారాముల్లాాఖజీగండ్ మధ్య రైలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశామన్నారు.