న్యూఢిల్లీ : గోవా సీఎం మనోహర్ పారికర్ ఆరోగ్యం మరింత క్షీణించింది. అమెరికాలో చికిత్స తీసుకుని వచ్చిన ఆయన ఇవాళ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో మళ్లీ చేరనున్నారు. ఆరోగ్యం దృష్ట్యా తాను సీఎంగా కొనసాగలేనని అధిష్టానానికి ఆయన తెలియజేశారు. దీంతో మోదీ, షాలు.. గోవా రాజకీయాలపై ఆరా తీస్తున్నారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో బాధపడుతున్న మాజీ రక్షణ మంత్రి పారికర్.. మూడు సార్లు చికిత్స కోసం అమెరికా వెళ్లి వచ్చారు. కానీ ఈసారి మాత్రం ఆయన తన పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధం అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో పారికర్ ఢిల్లీకి వెళ్తారు.