ప్రయివేట్ వ్యక్తుల కనుసన్నల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయని వైసీపీ విద్యార్ది విభాగం సర్వేపల్లి నియోజకవర్గ అధ్యక్షులు అమరా శివకుమార్ ఆరోపించారు. పొదలకూరులో ప్రయివేట్ కాలేజీ యాజమాన్యాల ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ జరుగుతోందని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తమ కాలేజీ విద్యార్దులకు ఎక్కువ మార్కులు సంపాదించుకునేలా ప్రయివేట్ కాలేజీల యాజమాన్యాలు ఇన్విజిలేటర్లను మభ్య పెడుతున్నారన్నారు. తద్వారా ప్రతిభ కల్గిన విద్యార్దులు నష్టపోయే ప్రమాదముందన్నారు. ఉన్నతాధికారులు స్పందించి పొదలకూరులో జరుగుతున్న ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు