ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం వైసీపీ విషసంస్కృతికి తెరలేపిందని జిల్లా టీడీపీ అధ్యక్షులు బీదా రవిచంద్ర మండిపడ్డారు.. తెలుగుదేశం పార్టీలో ఎంపీటీసీలు, కౌన్సిలర్లు చేరిక సందర్భంగా ఆయన వైసీపీ నేతలపై మండి పడ్డారు.. గ్రామాల్లో చిచ్చుపెడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. ఇష్టపూర్వకంగా పార్టీలోకి వస్తే ఆహ్వానించాలే గానీ బెదిరించి పార్టీలోకి లాక్కొవడం సరైన పద్దతి కాదన్నారు. మీరు అయిదు మందిని తీసుకెళ్తే మేము పాతిక మందిని తీసుకెళ్తామని ఆయన వైసీపీ నేతలను హెచ్చరించారు. జిల్లాలో టీడీపీకి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ పోటీలో నిలబడి కయ్యానికి కాలు దువ్వుతోందని మండిపడ్డారు