శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో దారుణం జరిగింది. బుధవారం తెల్లవారుజామున 2:30 గంటలకు బీజేపీ కార్యకర్త షబ్బీర్ అహ్మద్ భట్ నివాసంలోకి టెర్రరిస్టులు చొరబడ్డారు. అనంతరం అహ్మద్ భట్పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో భట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.