ఇస్లామాబాద్ : తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన నవజోత్ సింగ్ సిద్ధూకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కృతజ్ణతలు తెలిపారు. ఇరు దేశాల మధ్యా శాంతి యుత సంబంధాల పటిష్టతకు సిద్ధూ పర్యటన దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడుతూ సిద్ధూ పాకిస్థాన్ పర్యటనను విమర్శించే వారు శాంతి విఘాతకులు అని విమర్శించారు.