విజయవాడ : టీడీపీ సర్కారు రాష్ట్రాన్ని క్యాన్సర్ జబ్బులా పట్టుకుని రాష్ట్రాన్ని ఆర్ధికంగా అతలాకుతలం చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పార్థసారథి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్ధిక వనరుగా మార్చుకుని విచ్చలవిడిగా దోచుకుతింటున్నారని దుయ్యబట్టారు. విభజన చట్టంలో రాజధానిపై స్పష్టంగా ఉన్నా తన స్వార్ధం కోసం ఫణంగా పెట్టారని ఆరోపించారు. అప్పుల అప్పారావు లా మారి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశారన్నారు. ముడుపులు వస్తే చాలు రాష్ట్రం ఏమయితే నాకేంటి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
బాండ్ లు సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావచ్చు కదా, చంద్రబాబు దోచిన సొమ్ము బాండ్స్ రూపంలో ఇన్వెస్టర్ల పేరుతో కొంటున్నారిన తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర హక్కులు కాపాడటంలో పూర్తిగా విఫలమైంది, అందుకే అందిన కాడికి దోచుకుందాం అనే ఆలోచనతో ఉందన్నారు. ఇప్పుడు మంత్రుల చాంబర్స్ లో నీళ్లు ఎలా వచ్చాయి. మంత్రులే పైపులు కోశారా.. సిఆర్ డిఎ ఆర్థికంగా బలంగా ఉంటే ఎందుకు బాండ్స్ ఇష్యూ చేయాల్సి వచ్చింది. రాష్ట్రంపై పడుతున్న ఆర్థిక భారం ఎవరు మోస్తారు. ఇప్పటికైనా ప్రజలు చంద్రబాబు మోసాలు గుర్తించాలని తెలిపారు.