ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిలో అమెరికా రాయబారి పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 21, 2018, 02:13 PM

అమరావతి: భారత్‌లో ఆమెరికా రాయబారి కెన్నత్ జస్టర్ ఈరోజు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పర్యటించారు. అమరావతి మ్యూజియాన్ని సందర్శించి.. బౌద్ధ మత వ్యాప్తిని, విశిష్టతను తెలుసుకున్నారు. అమరావతిలో బుద్ధుడి అవశేషాలు కొలువైన మహా చైత్యం స్థూపాన్ని సందర్శించారు. ఇటలీ కంటే వెయ్యేళ్ల ముందే భారతీయ నాగరికత, సంస్కృతి విలసిల్లిందని తెలుసుకొన్నారు. ఇక్కడ బుద్ధుని విగ్రహం, పురాతన శిల్పాల ప్రత్యేకతను.. ఏపీ వారసత్వ నగరాల సలహాదారు గల్లా అమరేశ్వరరావు అమెరికా రాయబారికి వివరించారు. అనంతరం రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కుటుంబంతో కలిసి విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హైదారాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా కూడా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com