ఆంధ్రప్రదేశ్ జిల్లాల కలెక్టర్లుతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నీటి పారుదల ప్రాజెక్టుల పర్యవేక్షణలో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అద్భుత పనితీరు అని ప్రశంసించిన ముఖ్యమంత్రి కలెక్టర్ ధనంజయ రెడ్డి బృందం కలలు సాకారం చేసిందన్నారు. కలెక్టర్ ధనంజయ రెడ్డి మాట్లాడుతూ వంశధార రిజర్వాయర్లోకి నీటిని మళ్ళించడం జరుగుతోందన్నారు. ఇప్పటికే 1.50 టిఎంసి నీరు వచ్చిందని.. కనీసం 5 టిఎంసి నీటిని నిల్వ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రబీలో 1.30 నుండి 1.50 లక్షల ఎకరాల్లో పంటలు వేయడానికి కృషి చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు.