ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొట్టుకుపోయిన వినగడప-చీమలపాడు బ్రిడ్జి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 21, 2018, 01:10 PM

కృష్ణాజిల్లా: కృష్ణాజిల్లా తిరువూరునియెజకవర్గం గంపలగూడెం మండలం వినగడప నుండి చీమలపాడు మీదగా విజయవాడకి వెళ్ళే బిడ్జ్ వరదకి కొట్టుకుపోయింది. 10 రోజులుగా ఎడతెరిపలేకుండా కురిసేవర్షాలకు వరదప్రవహం ఎక్కువగాఉండి, నీటిప్రవహంలో తాటిమొద్దులు, చెత్తాచెదారం కొట్టుకువచ్చి బీడ్జ్ దగ్గర అడ్డుపడి సుమారుగా 50 అడుగుల పొడవు కొట్టుకుపోయినది. బిడ్జ్ ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియెజకవర్గ ఇంచార్జ్ నల్లగట్ల స్వామిదాస్ గారు పరిశీలించారు. ఆర్ అండ్ బీ ఈఈ గారితో ఫోన్లో మాట్లాడి వరదప్రవాహం తగ్గినతరువాత తాత్కాలిక రోడ్డును ఏర్పాటు చేయాలనికోరారు. గంపలగూడెం మండల ప్రజలకు చాలా ముఖ్యమైన రోడ్డు అని మైలవరం, విజయవాడ, మచిలీపట్నం వైపువెళ్ళే వారు ఎక్కువగా ఉన్నారని, వరద ఉదృత తగ్గినతరువాత రోడ్డు మార్గం చేయాలని తెలిపారు. ఈకార్యక్రమంలో చెరుకూరి రాజేశ్వరరావు, నీటిసంగం అధ్యక్షులు పుల్లయ్య చౌదరి, ఎంపీపీ శ్రీనుబాబు,జడ్పీటీసీ వెంకటకృష్ణారావు, వీరారెడ్డి, నాగమల్లేశ్వరరావు, పఠాన్ అమిత్ ఖాన్(బాజి),మనికొండ రామకృష్ణ, గంపలగూడెం ఎస్ఐ, డీఈ, ఏఈ తదితరులు పాల్గొన్ని పరిశీలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com