భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేయూతనందించింది. కేరళ బాధితుల సహాయార్థం యూఏఈ రూ.700 కోట్లును విరాళం ప్రకటించింది. ఇప్పటికే కేరళను ఆదుకునేందుకు కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. పలువురు సినీ ప్రముఖులు కూడా తమవంతుగా ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం రూ.600 కోట్లు ప్రకటించగా, పలు రాష్ట్రాలు తమవంతు సాయాన్ని ప్రకటించాయి. తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్లు, ఏపీ ప్రభుత్వం రూ.10కోట్ల సాయాన్ని అందించాయి.