నెల్లూరు జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని అన్నమేడు క్రాసురోడ్డు వద్ద మంగళవారం తెల్లవారుజామున నెల్లూరు నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. మరణించిన వ్యక్తి ఆత్మకూరు మండలానికి చెందిన వేణుగా గుర్తించారు. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులో ఉన్న మరో పదిహేను మందికి స్వల్ప గాయాలయ్యాయి.