తుంగభద్ర డ్యామ్కు వరద ఉధృతి పెరిగింది. తుంగభద్ర డ్యామ్ లో ప్రస్తుతం 1631.80 అడుగుల నీటి మట్టం ఉండగా పూర్తిస్థాయి నీటిమట్టం 110 టిఎంసిలు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 96.27 టిఎంసిలకు చేరింది. అధికారులు 2.5 గేట్లు 20; 1.0 గేట్లు 8 ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.