ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కైలాసపట్నం శివారు నుంచి జగన్ ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 21, 2018, 11:19 AM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న ప్రజాసంకల్ప పాదయాత్ర, 242వ రోజు నేడు విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో కొనసాగుతోంది. కైలాసపట్నం శివారు నుంచి జగన్ తన యాత్రను ప్రారంభించగా, మహిళలు బారులు తీరి స్వాగతం పలికారు. ఆ ప్రాంతంలో ఓ అభిమాని తాను తయారు చేసిన ఓ బుల్లి ఫ్యాన్ ను జగన్ కు బహూకరించగా, జగన్ దాన్ని అటూ ఇటూ తిప్పి ఆసక్తిగా చూశారు. ఇది బ్యాటరీతో పనిచేస్తుందని ఆ అభిమాని జగన్ కు తెలిపాడు. కాగా, నేడు చౌడువాడ క్రాస్‌, గొట్టివాడ, పండూరు క్రాస్‌, రామచంద్రపురం క్రాస్‌ మీదుగా దార్లపూడి వరకూ జగన్ నడవనున్నారు. జగన్‌ పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com