ఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి నుంచి చాలా నేర్చుకున్నామని బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ అన్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో మాజీ ప్రధాని వాజ్ పేయి సంతాపసభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వాజ్ పేయి మనల్ని విడిచి వెళ్లినందుకు బాధగా ఉందన్నారు. వాజ్ పేయి చూపిన మార్గంలో నడిచేందుకు కృషి చేయాలన్నారు.