పామర్రు: ఎస్సి రిజర్వేషన్ కలిగిన పామర్రు నియోజకవర్గంలో దళితులపై అక్రమంగా కుట్రపూరితంగా రౌడీ షీట్స్ ఓపెన్ చేశారని ఎస్పీకి పిర్యాదు చేశారు. ఈ పాలకులకు పామర్రు పోలీసులు సహకరించడం దారుణమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ కోలుసు పార్థసారథి గారు, రాష్ట్ర ఎస్సి సెల్ చైర్మన్ మెరుగ నాగార్జున్ గారు, మచిలీపట్నం సమన్వయకర్త పేర్ని నాని గారు, అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్ గారు, పామర్రు నియోజకవర్గ సమన్వయకర్త కైలే అనిల్ కుమార్ గారు వాపోయారు. ఈ విషయమై అధికారులైన సూపరింటెండెంట్ అఫ్ పోలీస్, కృష్ణాజిల్లా, మచిలీపట్నం వారికి పిర్యాదు చేశారు.