కేరళ వరద బాధితుల సహాయార్ధం తిరుపతి రైల్వేస్టేషన్ ఉద్యోగస్తులు మేము సైతం అంటూ కదిలారు. అధిక వర్షాలు, వరదల కారణంగా నిరాశ్రయులైన కేరళ వాసులకు ఆపన్నహస్తం అందించేందుకు రైల్వే కార్మికుల రెండు యూనియన్ల నాయకులు, వ్యాపారస్తులు గుంతకల్ డి ఆర్ ఎమ్ విజయప్రతాప్ సింగ్, స్టేషన్ డైరెక్టర్ కె. సత్యనారాయణ యొక్క పిలుపు మేరకు అనేక మంది ఉద్యోగులు తిరుపతికి వచ్చి దక్షిణ మధ్య రైల్వే జీఎం కు బియ్యం ,కొత్త బట్టలు, కొత్త వస్తువులు, తిరుపతి ఐ ఆర్ సి టి సి తరపున మేనేజర్ రమేష్ ఒక లారీ రైల్ నీర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు, బియ్యం మూటలు ఇవ్వనున్నారు. ఈ రోజు జిఎం వినోదకుమార్ కు వి.ఐ.పి లాంజ్ లో అందిచనున్నారు.