రాజమహేంద్రవరం : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి ప్రవాహ మళ్లీ పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 13.20 అడుగులకు చేరింది. అధికారులు బ్యారేజీ గేట్లు ఎత్తి 11 లక్షల 89 వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం మళ్లీ రెండో ప్రమాద స్థాయికి చేరుకునే అవకాశాలున్నట్లుగా ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. కాగా ఐదో రోజులుగా లంక గ్రామాలు జలదిగ్భందంలో నే ఉన్నాయి. కోనసీమలో మరోవైపు వశిష్ట , వైనతేయ, గౌతమీ ఉపనదులు పొంగుతున్నాయి. ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ లంక గ్రామాల ప్రజలు పడవల పైనే ప్రయాణాలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ధ గోదావరి నీటిమట్టం నిన్న కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ గోదావరి పరివాహాక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు మళ్ళీ మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంది. గత అర్థరాత్రి తర్వాత నుంచి నది నీటిమట్టం అంతకంతకూ పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శబరి నదికి కూడా వరద పోటెత్తుతోంది.