అమరావతి: నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. విపత్తులలో ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మన రాష్ట్రంలోనూ భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్రంగా ఉందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తి బాధ్యతతో వ్యవహరించాలన్నారు. వరద బాధిత ప్రాంతాలలో అధికారులు పర్యటించాలన్నారు. ప్రకృతి విపత్తుల తీవ్రతను అంచనావేసి ప్రాణ, ఆస్తినష్టం నివారించగలగాలని అధికారులకు సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమైందని, ఇదొక జాతీయ విపత్తు, సామాజిక బాధ్యతతో ఆదుకోవాలన్నారు.