ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమ్మిలేరుకు భారీ స్థాయిలో వరదనీరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 19, 2018, 03:26 PM

పశ్చిమ గోదావరి జిల్లా తమ్మిలేరు జలాశయానికి భారీ స్థాయిలో వరదనీరొచ్చి చేరుతోంది. ప్రస్తుతం 1200 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి చేరుతుండగా..జలాశయం నీటిమట్టం 342 అడుగులకు చేరింది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రా కాలువ ద్వారా ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంటోంది. పరిస్థితి ఇలాగే ఉంటే రేపు గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లుగా డ్యామ్ అప్పారావు తెలిపారు. ఎర్రంపల్లి కాలువ బాంక్ వద్ద జలాశయం కట్టకు కన్నం ఏర్పడటంతో అధికారులు దానిని పూడ్చివేసే పనుల్లో నిమగ్నమయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com