గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కేరళ వణికిపోతున్న సంగతి తెలిసిందే. నిరాశ్రయులన వారిని ఆదుకునేందుకు టాలీవుడ్ స్టార్స్ ముందుకొస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, రామ్ చరణ్లు కలిసి 50 లక్షల నగదు సాయం చేయగా, 10 లక్షల రూపాయల మందులు అందించేందుకు ఉపాసన ముందుకు వచ్చారు. కేరళలో ఫుల్ స్టార్ డం సంపాదించుకున్న బన్నీ 25 లక్షలు ప్రకటించాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 25 లక్షలు , కళ్యాణ్ రామ్ 10 లక్షలు, బాహుబలి ప్రభాస్ 25 లక్షల రూపాయలు, మహేష్ బాబు 25 లక్షలు, యంగ్ హీరో విజయ్ దేవరకొండ 5 లక్షలు, దర్శకుడు కొరటాల శివ 3 లక్షలు తమవంతు సాయంగా ప్రకటించారు. తాజాగా అక్కినేని ఫ్యామిలీకి చెందిన నాగార్జున, అమల తాము 28 లక్షల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఇటీవల ఘనవిజయం సాధించిన గీత గోవిందం చిత్రాన్ని కేరళలో ప్రదర్శన జరిపి వచ్చిన మొత్తాన్ని కేరళ సీఎం రిలీఫ్ అండ్కి అందించాలని చిత్ర నిర్మాత భావిస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.