భారీ వరదలతో కేరళలో ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఉండటానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక చుట్టూ నీరున్నా తాగేందుకు గుక్కెడు నీరు లేక లక్షల మంది ప్రజలు అల్లాడిపోతున్నారు. కేరళ బాధితులకు సహాయం అందించేందుకు టాలీవుడ్ కదిలింది. ప్రముఖ హీరోలంతా విరాళాలు ప్రకటించారు. నటుడు విక్రమ్ రూ.35 లక్షలు, ప్రభాస్ రూ.25 లక్షలు, అక్కినేని నాగార్జున, అమల రూ.28 లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ రూ.25 లక్షలు, కల్యాణ్ రామ్ రూ.10 లక్షలు విరాళాలను ప్రకటించారు. పవన్ కల్యాణ్ రూ.2 కోట్లు, కొణిదల చిరంజీవి రూ.25 లక్షలు, చిరంజీవి తల్లి రూ.లక్ష, రామ్ చరణ్ తేజ్ రూ. 60 లక్షలు, 10 లక్షల రైస్ అండ్ వాటర్ పాకెట్స్, చరణ్ భార్య ఉపాసన రూ. 1.5 కోట్లు, రైస్ పాకెట్స్, నాగేంద్రబాబు రూ.15 లక్షలు విరాళం అందజేస్తున్నట్లు ప్రకటించారు.