తిరువనంతపురం: కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు సదరన్ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. కొన్ని రైళ్ల రాకపోకల సమయాలను మార్చామని, మరికొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేశామని అధికారులు తెలిపారు. పాల్ఘట్ డివిజన్ పరిధిలోని షోరనూర్-కోజికోడ్ రైలు మార్గం, ట్రివేండ్రం డివిజన్ పరిధిలోని ఎర్నాకులం-కొట్టాయం-కయంకులం సెక్షన్లో రైలు మార్గాలను మూసేశామని రైల్వే అధికారులు తెలిపారు.
క్యాన్సిలైన రైళ్ల వివరాలు
కేఎస్ఆర్ బెంగళూరు - కొచువెలి ఎక్స్ప్రెస్ (19 ఆగస్టు) (ట్రెయిన్ నం.12257)
ట్రివేండ్రం-చెన్నై మెయిల్ (19 ఆగస్టు) (ట్రెయిన్ నం.12624)
కన్యాకుమారి-కేఎస్ఆర్ బెంగళూరు ఐల్యాండ్ ఎక్స్ప్రెస్ (19 ఆగస్టు) (ట్రెయిన్ నం.16525)
ధన్బాద్-అలెప్పి ఎక్స్ప్రెస్ (19 ఆగస్టు) (ట్రెయిన్ నం.13351)
ట్రెయిన్ నం.17229 ట్రివేండ్రం సెంట్రల్-హైదరాబాద్ శబరి ఎక్స్ప్రెస్ రైలును పాక్షికంగా రద్దు చేశారు. ట్రివేండ్రం సెంట్రల్-తిరుపతి మధ్య ఈ రైలు నడవదని రైల్వే అధికారులు తెలిపారు.