ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంలో నవంబర్ నుంచి భక్తులకు డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నట్లు ఆలయ నిర్వహణాధికారి డి.పెద్దిరాజు తెలిపారు. పురుషులు పంచె, కండువా..మహిళలు చీర, చుడీదార్ మాత్రమే ధరించి స్వామివారిని దర్శించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ద్వారకా తిరుమలను భక్తులు రెండో తిరుపతిగా భావిస్తారు. ఆలయంలో నిత్యార్జిత కల్యాణం జరిపించుకునే భక్తులు డ్రెస్ కోడ్ తప్పకుండా పాటించాల్సిందేనని పెద్దిరాజు తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ షరతులు అమల్లోకి వస్తాయని, భక్తులు గమనించాలని కోరారు.