శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు పెరిగింది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు 8 గేట్లు ఎత్తివేసి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతుండడంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.00 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 198.812 టీఎంసీల నీరు నిల్వ ఉంది.