తూ.గో జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పంతం నానాజీ ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ రోజు ఉదయం ఆయన మీడియాతోగత 32 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా రాజకీయ ప్రారంభించిన తాను అనేక పదవులు చేపట్టిన తాను కాంగ్రెస్ పార్టీ చాలా బాధాకరంగా ఉందని కాకపోతే కొంత మంది స్వార్థ పరుల కారణంగా పార్టీ మనుగడ లేకుండా పోయిందని అన్నారు. అయితే తనను నమ్ముకున్న వారికి న్యాయం చేయాలేక పోతున్నానని కేవలం ప్రజలకు సేవ చేయడానికి జనసేన లో జాయిన్ అవుతున్నట్లు అలాగే తాను ఎవ్వరిని కాంగ్రెస్ పార్టీ నుంచి రమ్మని అడగ లేదని కేవలం ఇది తన సొంత నిర్ణయం అన్నారు. తాను ఏ టిక్కెట్లు ఆశించడం లేదని, కేవలం పవన్ కళ్యాణ్ విధి విధానాలు, అతని కమిట్ మెంట్ నచ్చి జనసేన పార్టీ లో జాయిన్ అవుతున్నానని తెలిపారు.