రాజమండ్రి : ధవళేశ్వరం వద్ద గోదావరికి వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం 13.10 అడుగులుగా ఉండగా..మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అధికారులు 11 లక్షల 74 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సాయంత్రానికి వరద మరింత తగ్గే అవకాశముందని అధికారులు తెలిపారు.